Header Banner

నటుడు మోహన్ బాబుకి సుప్రీంలో దక్కని ఊరట! అసలేం జరిగిందంటే..

  Wed Apr 30, 2025 21:42        Entertainment

నటుడు, శ్రీ విద్యానికేతన్ సంస్థల వ్యవస్థాపకుడు మోహన్ బాబుకి సుప్రీంకోర్టులో బిగ్ షాక్ తగిలింది. ఎల్లుండి కోర్టు విచారణకు మోహన్ బాబు హాజరు కావలసిందేనని సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది. 2019లో ఫీజు రేయింబర్స్ మెంట్ కోసం తిరుపతిలో మోహన్ బాబు ధర్నా చేసిన సంగతి తెలిసిందే. ఎన్నికల కోడ్ అమలులో ఉండగా ధర్నా చేయడంపై వివాదం నెలకొంది. ఎన్నికల కోడ్‌కు విరుద్ధంగా ధర్నా చేశారని ఏపీ పోలీసులు ఆయనపై కేసు నమోదు చేశారు. 2021లో పోలీసులు చార్జిషీట్‌ను దాఖలు చేశారు. అయితే, ఈ చార్జిషీట్‌ను కొట్టేయాలని నటుడు మోహన్ బాబు సుప్రీంను ఆశ్రయించారు. అయితే, మోహన్ బాబు పిటేషన్‌ను విచారించిన జస్టిస్ బేలా ఎం త్రివేది ధర్మాసనం.. ఛార్జ్ షీట్‌ను కొట్టేయడానికి నిరాకరించింది. ఎల్లుండి విచారణకు రావాలని స్పష్టం చేసింది. అయితే, ఎల్లుండి తిరుపతి మెజిస్ట్రేట్ కోర్ట్‌లో విచారణకు హాజరు కాకుండా మినహాయింపు అయినా ఇవ్వాలని మోహన్ బాబు తరపు న్యాయవాది సుప్రీంలో కోరారు.

 

ఇది కూడా చదవండి: ఏపీ యువతకు గుడ్ న్యూస్.. యునిసెఫ్‌తో ప్రభుత్వం ఒప్పందం.. 2 లక్షల మందికి లబ్ధి..

 

అందుకు నిరాకరించిన ధర్మాసనం ఎల్లుండి విచారణకి మోహన్ బాబు హాజరు కావాల్సిందేనని తేల్చి చెప్పింది. 2019లో అధికారంలో ఉన్న టీడీపీ ప్రభుత్వం తమ విద్యాసంస్థల్లో చదువుకుంటున్న విద్యార్థులకు ఎలాంటి ఫీజు రీయింబర్స్ మెంట్ చెల్లించలేదని మార్చి 22న మంచు కుటుంబం ధర్నా చేసింది. తిరుపతి - మదనపల్లె జాతీయ రహదారిపై నటుడు మోహన్ బాబు, ఆయన కుమారులు మంచు విష్ణు, మంచు మనోజ్ కుమార్ విద్యార్థులతో కలిసి బైఠాయించి ఆందోళన చేశారు. అప్పటికే సార్వత్రిక ఎన్నికల కోడ్ అమలులో ఉండటంతో పోలీసులు మోహన్ బాబుపై కేసు నమోదు చేశారు. రోడ్డుపైకి వచ్చి వాహనదారులకు తీవ్ర ఇబ్బంది కలిగించారని, ఎన్నికల కోడ్ ఉల్లంఘించారని, ధర్నాకు ముందస్తుగా పోలీసుల నుంచి అనుమతి తీసుకోలేదని పలు సెక్షన్ల కింద వీరిపై చంద్రగిరి పోలీసులు కేసు నమోదు చేశారు.

 

ఇది కూడా చదవండి: పలు నామినేటెడ్ పోస్టులు భర్తీ చేసిన సీఎం చంద్రబాబు! లిస్ట్ ఇదుగోండి..

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

అద్భుతమైన స్కీం.. మీ భార్య మిమల్ని లక్షాధికారిని చేయొచ్చు.. ఈ‌ చిన్న పని తో..

 

కొత్త రేషన్ కార్డులపై శుభవార్త చెప్పిన మంత్రి.. ప్రతి కుటుంబానికి ఉచితంగా - తాజాగా కీలక ప్రకటన!

 

6 లైన్లుగా రహదారి, డీపీఆర్‌పై కీలక అప్డేట్! ఆకాశనంటుతున్న భూముల ధరలు..

 

సీఐడీ క‌స్ట‌డీలో పీఎస్ఆర్ - మూడో రోజు కొనసాగుతున్న విచారణ! 80కి పైగా ప్రశ్నలు..

 

స్కిల్ కేసు లో చంద్రబాబుని రిమాండ్ చేసిన న్యాయమూర్తి! న్యాయ సేవా అధికార సంస్థ సభ్య కార్యదర్శిగా నియామకం! ప్రభుత్వం జీవో జారీ!

 

మరి కొన్ని నామినేటెడ్ పోస్టులు భర్తీ చేసిన కూటమి ప్రభుత్వం! ఎవరెవరు అంటే?

 

ఏపీ రాజ్యసభ స్థానం - ఎన్డీఏ అభ్యర్థి ఖరారు! మరో రెండేళ్ల పదవీ కాలం..

 

శుభవార్త: వాళ్ల కోసం ఏపీలో కొత్త పథకం.. రూ. లక్ష నుంచి రూ.8 లక్షలు పొందొచ్చు.. వెంటనే అప్లై చేసుకోండి!

 

తిరుపతిలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఐదుగురు స్పాట్ డెడ్!

 

గడియార స్తంభం కూల్చివేతకు రంగం సిద్ధం! 20 సంవత్సరాల క్రితం - కారణం ఇదే.!

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #AndhraPravasi #Sports #teamindia